11 May, 2026 | 1:37 PM

Breaking News

మొగిలిపేట క్లస్టర్ గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమం   •   ​తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి   •   పంటకోతకు యంత్రాల కొరత.. ఇబ్బందులు పడుతున్న రైతన్న   •   బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ   •   చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్‌ పర్యాటకులు మృతి   •   మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •   అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు   •   ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •  

పంటకోతకు యంత్రాల కొరత.. ఇబ్బందులు పడుతున్న రైతన్న

11-05-2026 01:00 PM

బోథ్,(విజయక్రాంతి):  ఈ ఏడాది జొన్న మొక్కజొన్న పంటల సాగు(Cultivation of Maize Crops) విస్తీర్ణం పెరగడంతో పంట కోతకు యంత్రాలు దొరకకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, ఈ ఏడాది బోత్ సోనాల మండలాల్లో కలిసి 22000 ఎకరాలలో జొన్న మొక్కజొన్న పంట లు సాగుతున్నాయి. అయితే పంట కోతకు వస్తున్న సమయంలో కోత యంత్రాలు దొరకక రైతులు సతమతమవుతున్నారు.

పంట పూర్తిగా ఎండిపోవడంతో యంత్రాల ద్వారా కటింగ్ చేయించి విక్రయించాలన్న దృక్పథంతో రైతులు ఉన్నారు. ఇటీవల చేతి కచ్చే పంట అగ్ని ప్రమాదాల వల్ల రైతులు నష్టపోతుండడంతో పంటను ఎలాగైనా ఇంటికి తీసుకురావాలన్న ఉద్దేశంతో రైతులు ఉన్నారు. మరోవైపు వర్షాలు కురుస్తుండడంతో చేతికందే పంట జొన్న తిండి గింజలు చెడిపోయే ఆస్కారం ఉందని అంటున్నారు. ఏది ఏమైనా రైతులు యంత్రాల దొరకక సతమతమవుతున్నారు.