11 May, 2026 | 1:51 PM

Breaking News

మొగిలిపేట క్లస్టర్ గ్రామాల్లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అవగాహన కార్యక్రమం   •   ​తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి   •   పంటకోతకు యంత్రాల కొరత.. ఇబ్బందులు పడుతున్న రైతన్న   •   బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ   •   చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్‌ పర్యాటకులు మృతి   •   మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •   అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు   •   ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •  

బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ

11-05-2026 12:58 PM

న్యూఢిల్లీ: బంగారం(Gold Purchases) సామాన్యుడికి అందనంత దూరానికి చేరింది. బంగారం కొనుగోళ్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi warns) దేశ ప్రజలను హెచ్చరించారు. కొనసాగుతున్న ఇరాన్-అమెరికా యుద్ధం, పెరుగుతున్న ముడిచమురు ధరల వల్ల కలిగిన ఆర్థిక పరిణామాలతో దేశం సతమతమవుతున్న నేపథ్యంలో బంగారం కొనుగోళ్లను మానుకోవడం, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం, ఇంటి నుంచే పనిచేయడం వంటి ఖర్చులను తగ్గించుకునే చర్యలను చేపట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం భారతీయులకు పిలుపునిచ్చారు.

 ఒక సంవత్సరం పాటు బంగారం కొనడం మానుకోవాలని ప్రధాని మోదీ భారతీయులను కోరారుఇప్పటికే బంగారంపై 6 శాతం దిగుమతి సుంకం విధించినట్లు సూచించారు. ప్రధాని మోదీ వ్యాఖ్యల తర్వాత బంగారంపై దిగుమతి సుంకం పెంచేస్తారని ఊహాగానాలు జోరందుకున్నాయి. భారత్ ఏటా 700-800 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటుందని ప్రధాని వెల్లడించారు. భారత్ లో బంగారం వినియోగంతో దిగుమతుల విలువ 90 శాతానికి పైగా ఉందన్నారు.