కేటీఆర్ను కలిసిన శ్రీలంక మంత్రి సదాశివన్
19-08-2024 12:18 PM
హైదరాబాద్: మాజీ ఐటి శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటిఆర్ను శ్రీలంక వాణిజ్య, పర్యావరణ శాఖల మంత్రి సతాశివన్ వియలందేరన్ కలిశారు. హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జి పరిసర ప్రాంతాల అభివృద్ధిని చూస్తే.. సింగపూర్ను తలపించేలా ఉందని ప్రశంసించారు. ఐటీ, పరిశ్రమల మంత్రిగా కేటిఆర్ తెలంగాణను పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్గా మార్చిన తీరును సతాశివన్ అభినందించారు. హైదరాబాద్ను అవకాశాల హబ్గా మార్చడంలో తమ కృషిని గుర్తించినందుకు మంత్రి సదాశివంకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.






