2 July, 2026 | 12:24 PM

Breaking News

వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •  

శ్రీ సీతారాముల శోభాయాత్ర పర్యావరణ హితంగా నిర్వహించాలి

31-03-2025 01:01 AM

ముషీరాబాద్, మార్చి 30: (విజయ క్రాంతి): ప్రజల్లో భక్తి భావాన్ని పెంచేందుకు శ్రీరామనవమి ఉత్సవ సమితి శోభా యాత్ర నిర్వహించడం అభినందనీయమని,  అయితే ఆ యాత్ర ను పర్యావరణ హితంగా నిర్వహించాలని ఉత్సవ సమితికి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ (EPDC )బహిరంగ విజ్ఞప్తి చేసింది. అంబర్ పేట శ్రీ రామ నవ మి ఉత్సవ సమితి కన్వీనర్ డాక్టర్ గౌతమ్ రావు ఆధ్వర్యంలో శనివారం ఉత్సవ సమితి బృందం శోభాయాత్రలో ద్విచక్ర,  త్రిచక్ర,  చతుర్ చక్ర వాహనాలకు అనుమతి కావాలని పోలీస్‌లను కోరిన నేపథ్యాన్ని పురస్కరించుకొని ఈపీ డీసీ వ్యవస్థాపక అధ్యక్షులు రంగయ్య ఆదివా రం ఒక ప్రకటన విడుదల చేశారు. వాహనాల కారణంగా యాత్ర కాలుష్యమయం కాకుండా ఉండేందుకు భక్తులు పాదయాత్ర చేసేలా సమితి చొరవ తీసుకోవాలని కోరారు. భారతీయ సంప్రదాయమే ప్రకృతి సంరక్షణ అని దానికి భిన్నం గా శ్రీరామ నవమి శోభాయాత్ర సాగడం తగదన్నారు. మహానగరంలో ట్రాఫిక్ సమ స్య రాకుండా  పటిష్ట వ్యూహం రూపొందించుకోవాలని కోరుతూ యాత్ర విజయవం తం కావాలని రంగయ్య ఆకాంక్షించారు.