calender_icon.png 26 December, 2025 | 5:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యప్ప ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి

26-12-2025 04:16:43 PM

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్,(విజయక్రాంతి): అయ్యప్ప స్వామి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, శాంతియుతంగా జీవించాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆకాంక్షించారు. శుక్రవారం నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామివారి 34వ మండలపూజ కార్యక్రమంలో ఆయన పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  మండలపూజ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు యువతలో క్రమశిక్షణ, సేవాభావాన్నిపెంపొందిస్తాయని, సమాజంలో ఐక్యతను బలోపేతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా గాయని వేముల పుష్ప, నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ చౌగొని రజిత శ్రీనివాస్, కౌన్సిలర్ గాజుల సుకన్య, పార్టీ సీనియర్ నాయకులు పన్నాల రాఘవరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.