కిష్టస్వామి లేని లోటు పూడ్చలేనిది
16-03-2026 09:55 AM
కిష్ట స్వామి ప్రథమ వర్ధంతిలో టీపిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు
మంథని,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తాటికొండ కిష్టస్వామి లేని లోటు పూడ్చలేనిదని టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు అన్నారు. మంథని పట్టణములో కిష్టాస్వామి ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో శ్రీను బాబు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. శ్రీను బాబు వెంట మంథని మున్సిపల్ చైర్ పర్సన్ వొడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డి తో పాటు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




