9 June, 2026 | 3:45 PM

Breaking News

ఆర్అండ్‌బీ ఈఎన్సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు   •   రానున్న రెండు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు   •   స్టేషన్ ఘన్‌పూర్‌లో పర్యటించిన డిప్యూటీ సీఎం భట్టి   •   ఎప్టీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవం... పరిశ్రమల ద్వారా పెద్దఎత్తున ఉపాధి   •   విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులను పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్   •   గచ్చిబౌలిలో భారీ చోరీ.. ఇద్దరు నిందితులు అరెస్ట్   •   ఖమ్మంలో బాలికపై లైంగిక దాడి   •   తాటి చెట్టు పైన గుండెపోటుతో వెంకన్న మృతి   •   నూతన వైద్యాధికారిగా డాక్టర్ కె. కృష్ణ   •   అనురాగ్‌లో ఫార్మాస్యూటికల్ టీచర్స్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్   •  

ఎస్‌ఎస్‌సీ మూల్యాంకన పారితోషికం చెల్లించాలి

07-04-2026 02:24 AM

నేడు స్పాట్ కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు

టీటీజేఏసీ సంఘాలు

హైదరాబాద్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): గతేడాదిలో పదో తరగతి స్పాట్ మూల్యాంకన, కులగణన విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు పారితోషకం చెల్లించాలని ఉపాధ్యాయ సంఘాలైన టీటీ జేఏసీ, యూఎస్‌పీసీ, జాక్టో డిమాం డ్ చేశాయి. గతంలో ఎన్నోసార్లు విజ్ఞ ప్తి చేసినా ప్రభుత్వం వాటిని చెల్లించకుండా తాత్సారం చేస్తుండటంతో మంగళవారం స్పాట్ కేంద్రాల్లో భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు సోమవారం ఉమ్మడి ప్రకటనను ఆయా సంఘాలు విడుదల చేశాయి. గత ఏడు సంవత్సరాలుగా స్పాల్ పారితోషకం పెంచలేదని, స్పాట్ రేట్లను కనీ సం 50 శాతం పెంచాలని కోరాయి. నేడు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే నిరసన కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సంఘాల నేతలు పిలుపునిచ్చారు.