31 May, 2026 | 7:37 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

బేగంపేటలో బాలింతకు పురుడు పోసిన 108 సిబ్బంది

02-11-2025 04:56 PM

తల్లి, బిడ్డ క్షేమం పెద్దపల్లి మాత శిశు ఆసుపత్రికి తరలింపు..

108 సిబ్బంది కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు..

రామగిరి (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని బేగంపేట గ్రామానికి చెందిన బాలింత గోవిందుల మౌనిక(28)కు పురిటి నొప్పులు ప్రారంభం కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే 108కి సమాచారం అందించారు. హుటాహుటిన అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకోగానే మహిళకు పురిటి నొప్పులు తీవ్రతరం కావడంతో 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నిమ్మతి శ్రీనివాస్ చాకచక్యంగా వ్యవహరించి, వారి ఇంట్లోనే డెలివరీ నిర్వహించారు. 

అ ఆడపడుచు పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రాథమిక చికిత్స అనంతరం తల్లి, బిడ్డలను తదుపరి చికిత్స నిమిత్తం పెద్దపల్లిలోని మాత శిశు ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని, సకాలంలో స్పందించిన 108 అంబులెన్స్ సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నిమ్మతి శ్రీనివాస్, పైలట్ మామిడి సంపత్ లకు మాతా శిశు ఆరోగ్య సిబ్బంది అభినందనలు తెలియజేశారు. కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.