02-06-2025 04:54:12 PM
జాతీయ జెండా ఎగరేసిన అధికారులు ప్రజాప్రతినిధులు..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు సోమవారం జిల్లా కేంద్రంలో అధికారులు ప్రజా ప్రతినిధులు జాతీయ జెండాను ఎగరవేసి ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పరిషత్ కార్యాలయంలో కలెక్టర్ ఇలా త్రిపాటి(District collector Ila Tripathi), జిల్లా కోర్టు ఆవరణలో ప్రధాన న్యాయమూర్తి నాగరాజు(Chief Justice Nagaraju), జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్(SP Sharath Chandra Pawar), రెవిన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డిఓ అశోక్ రెడ్డి, విద్యాధికారి కార్యాలయంలో డీఈవో బొల్లారం బిక్షపతి, జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో డిఎంహెచ్వో పుట్ల శ్రీనివాస్, డివిజన్ పోలీస్ కార్యాలయంలో డి.ఎస్.పి కే శివరామిరెడ్డి, వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సీఐ వేమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీందర్ కుమార్ నాయక్, భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యాలయంలో జెడిఏ శ్రావణ్ కుమార్, సిపిఐ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సిపిఎం కార్యాలయంలో జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డితో పాటు వివిధ కార్యాలయాలలో ఆయా అధికారులు జాతీయ జెండా ఎగరేశారు.