calender_icon.png 4 June, 2025 | 11:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆస్ట్రేలియాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

02-06-2025 04:58:50 PM

ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్,(విజయక్రాంతి): మెల్‌బోర్న్‌లో బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి(BRS Australia President Kasarla Nagender Reddy) ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు(Telangana Formation Day Celebrations) వైభవంగా నిర్వహించబడాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani Srinivas Yadav) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన కేసీఆర్(KCR) పాలన దేశానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. రైతులకు మద్దతుగా అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రశంసనీయమని, కానీ ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి కోలపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలకు నిరాశ ఎదురవుతోందని, రైతులు, యువత, ఉద్యోగులు నష్టపోతున్నారని వ్యాఖ్యానించారు.

ప్రజలు ఇప్పుడు కేసీఆర్ పాలన రోజులను తలుచుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరుగులేని విజయం సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర అపూర్వమైనదని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం రాష్ట్రం తిరోగమన దిశలో వెళ్తోందని, ప్రజలు దీనిని గమనిస్తున్నారని వెల్లడించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ నాయకులు ఉదయ్ సింహా రెడ్డి, వినయ్ సన్నీ, సతీష్ పులిపాక, కత్తుల వినోద్, హర్ష, సాయికృష్ణ కల్వకుంట్ల, అశోక్ ఈగ, స్థానిక తెలుగు సంఘాల నాయకులు, ఎన్నారైలు పాల్గొన్నారు.