21-06-2025 02:03:04 AM
రాజన్న సిరిసిల్ల జూన్ 20 (విజయక్రాంతి): ప్రజా ప్రభుత్వంలో క్రీడలకు పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు..శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర స్పోరట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి సిరిసిల్ల పట్టణంలోని రాజీవ్ నగర్ మినీ స్టేడియంలో ఆర్చరీ అకాడమీ ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని బతుకమ్మ ఘాట్ వద్ద స్టేడియం నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు.
వారు మాట్లాడుతూ ఆటలు ఆడటం వల్ల శారీరక దృఢత్వం లభిస్తుందనీ,మన ప్రాంతంలో అనేక మంది క్రీడాకారులకు నిలయంగా మారిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులకు పెద్దపీటవేస్తోందని,జిల్లాలో వేములవాడ పట్టణంలో ఇండోర్ స్టేడియం నిర్మాణం,చందుర్తి మండలం మూడపల్లి వద్ద మినీ స్టేడియం నిర్మాణం, సిరిసిల్ల పట్టణంలో మినీ స్టేడియంలో నిర్మాణం కోసం స్థల పరిశీలన జరిగిందన్నారు.తెలంగాణ రాష్ట్రంలోనే ఆర్చరీ అకాడమీనీ జిల్లా కేంద్రంలో ప్రారంభించుకోవడం అభినందనీయమన్నారు.