21-06-2025 02:04:26 AM
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల అర్బన్, జూన్ 20 (విజయక్రాంతి): జగిత్యాల పట్టణ అభి వృద్ధిలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.జగిత్యా ల పట్టణ 41వ వార్డు లో రు.25 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సంజయ్ కు మార్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల అభివృద్ధి పను ల్లో నాణ్యత ప్రమాణాలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
రూ. 36 కోట్లతో అమృత్ కార్యక్రమంలో భాగంగా తాగు నీటి పనులు జరుగుతున్నాయని,పట్టణాభివృద్ధిలో ప్రజల సహకారం తప్పనిసరన్నారు. గతంలో ఎన్నడు లేని విధంగా ప్రతి వార్డులో రూ.2 కోట్లతో అభివృద్ది పనులు జరుగుతున్నాయన్నారు. లే అవుట్ లేకుండా ఇంటి నిర్మాణాలు చేపట్టరాదన్నారు. పట్టణ సుందరీకరణలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరిగా అవసరమన్నారు.
ఈ కార్య క్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ కప్పల శ్రీకాంత్, ఏవో శ్రీనివాస్, ఏఈ శరన్, బాలే శంకర్, రాజ్ కుమార్, రాజు, తదితరులుపాల్గొన్నారు.