రుద్రంగిలో ఓటు వేసిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
12-12-2025 02:10 AM
వేములవాడ, డిసెంబర్ 11,(విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, రుద్రంగి మండల కేంద్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గురువారం తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించిన ఆది శ్రీనివాస్ ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైందని, ప్రజలు కూడా భారీగా తరలివచ్చి ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని స్థానిక పాలనను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.




