రాఘవపురంలో ఇరుపార్టీల ప్రచారం జోరు
మోతె, డిసెంబర్ 11 (విజయ క్రాంతి):- గురువారం మండల పరిధిలోని రాఘవ పురం గ్రామంలోకాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి మాట్లాడారు. అధికార కాంగ్రెస్ పార్టీ బి ఆర్ యస్ పార్టీల కు చెందిన రెండు పార్టీల అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. సి పి యం పార్టీ బలపర్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మద్ది మంజుల భాస్కర్ రెడ్డి గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేస్తున్నారని మంజుల భాస్కర్ రెడ్డి చెప్పారు.
గ్రామం లో నేటికీ పరిస్కారం కానీ పనులన్నింటిని పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. గ్రామంలో సి సి రోడ్లు వీధి దీపాలు పూర్వపు డొంక బాటలన్ని రోడ్లు వేయడం జరుగుతుందని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం జరుగుతుందిని తెలిపారు. బి ఆర్ యస్ అభ్యర్థి మట్టి పల్లి నీలమ్మ రామల్లు మాట్లాడుతూ గ్రామంలో నన్ను ఆదరించి ఓట్లు వేసిన ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా గ్రామాన్ని అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామాన్ని చేయడమే నా లక్ష్యం మన్నారు. ఇరు పార్టీల కార్యకర్తలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.




