05-09-2025 07:46:39 PM
ముదిరాజ్ లను ఏ గ్రూపులో ప్రభుత్వం చేర్చుతుందని నమ్మకం ఉంది
త్వరలో రాష్ట్ర స్థాయి సమావేశం
రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్
కామారెడ్డి (విజయక్రాంతి): ముదిరాజ్ లను ఏ గ్రూపులో ప్రభుత్వం కలుపుతుందని నమ్మకం ఉందని రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్(State Mudiraj Corporation Chairman Borra Gnaneshwar) అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని లిటిల్ స్కాలర్ స్కూల్లో ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో అధిక శాతం ఉన్న ముదిరాజులలో ఐక్యత లోపం అనే సమస్య వల్ల సతమతమవుతున్నారని రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్ర జ్ఞానేశ్వర్ తెలిపారు. తెలంగాణలో అత్యధిక ఓటర్లు ఉండి అత్యధిక జనాభా కలిగి ఐక్యత లోపం మూలంగా ప్రభావం చూపలేకపోతున్నారన్నారు. ఐక్యత లోపాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ముదిరాజుల ఉందన్నారు. కామారెడ్డి లిటిల్ స్కాలర్స్ స్కూలులో సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం పురస్కరించుకొని ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ముదిరాజ్ ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేయడం గర్వనీయమన్నారు. చైతన్యవంతమైన ముదిరాజులు తలుచుకుంటే సాధించలేనిది లేదన్నారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి ఉందన్నారు. ముదిరాజ్ యువత నిరుద్యోగులకు వ్యాపారాల కోసం ముదిరాజ్ కార్పొరేషన్ ద్వారా రుణ సౌకర్యాలు త్వరలో అందనున్నయని ఆన్నారు. ముదిరాజ్ కార్పొరేషన్ కు వెయ్యి కోట్ల బడ్జెట్ ఇవ్వాలని తక్కువ బడ్జెట్ ఇచ్చారనీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మహాసభ అధ్యక్షులు కరాటే రమేష్ కుమార్ అన్నారు. ముదిరాజులను ఏ గ్రూపులో చేర్చకుంటే కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెబుతారన్నారు. లోగడ ముదిరాజులను గులాబీ పార్టీ తక్కువ చేసినందున గుర్తించనందున మాజీ సీఎం కేసిఆర్ ను ముదిరాజ్ లు కామారెడ్డిలో ఓడించారనీ అన్నారు.
కాంగ్రెస్ సర్కారు ముదిరాజులకు న్యాయం చేయకుంటే కాంగ్రెస్ కూడా గద్దె దించుతారనీ కరాటే రమేష్ హెచ్చరించారు. ముదిరాజ్లను ఏ గ్రూపులో చేర్చడానికి మరో ఉద్యమం భవిష్యత్తులో రాబోతుందన్నారు. ముదిరాజ్ సంఘాలు ఐక్యత కావలసిన ఆవశ్యకత ఉందన్నారు. రాష్ట్రంలో 40 వివిధ రకాల స్థాయిల్లో ముదిరాజ్ సంఘాలు ఉన్నాయని ఇంటింటికి చైతన్య పరచాల్సిన అవసరం ఉందనీ మాజీ జిల్లా గ్రంథాలయ సమస్త చైర్మన్ పున్న రాజేశ్వర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు భూపాల్ విజయానంద్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేష్, జిపీ న్యాయవాది, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గజ్జల బిక్షపతి, నిజ్జన రమేష్, మహేష్, జయ ప్రకాష్ యువసేన అధ్యక్షులు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.