15 April, 2026 | 6:04 AM

ఎన్నికల సరళిని పరిశీలించిన స్టేట్ అబ్జర్వర్ మధుకర్ బాబు

15-12-2025 12:44 AM

మహబూబాబాద్, డిసెంబర్ 14 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో ఆదివారం నిర్వహించిన రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల సరళిని స్టేట్ ఎలక్షన్ అబ్జర్వర్ మధుకర్ బాబు కూచిపూడి పరిశీలించారు.

జిల్లాలోని నర్సింహులపేట మండలంలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ సరళి, అధికారుల పర్యవేక్షణ తీరును పరిశీలించారు. స్టేట్ అబ్జర్వర్ వంట మండల ప్రత్యేక అధికారి శ్రీమన్నారాయణ రెడ్డి, ఎంపీడీవో రాధిక, తహసిల్దార్ రమేష్ బాబు ఉన్నారు.