27-05-2025 08:03:37 PM
లారీ ఢీకొని విగ్రహం ధ్వంసం..
పెద్దపల్లి (విజయక్రాంతి): పెద్దపల్లి మండలం(Peddapalli Mandal)లోని పెద్దబోంకూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఆటో స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం గత రెండు రోజులుగా కనిపించడం లేదు. నిత్యం లారీలు అధిక లోడ్ తో పాటు వేగంతో ప్రయాణిస్తుండటంతో అంబేద్కర్ విగ్రహం గద్దెకు ఢీకోని విగ్రహం ధ్వంసం అయినట్లు గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఇంత తతంగం జరిగిన కూడా ఈ విషయం బయటకి రాకుండా, ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా సంబంధిత సంఘం సభ్యులు, అధికారులు పట్టించుకోని పరిస్థితి ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం లేకపోవడంతో గ్రామానికి ఉన్న కళా తప్పిందని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా సంఘం నాయకులు స్పందించి అంబేద్కర్ విగ్రహం వెంటనే ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.