27-05-2025 08:08:33 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): చెరువు కట్ట మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇరిగేషన్ శాఖ మహబూబాబాద్ ఈఈ సాల్మన్ రాజు(Irrigation Department EE Salmon Raju) కాంట్రాక్టర్ కు సూచించారు. మహబూబాబాద్ జిల్లా కొత్తూరు గ్రామంలో గత ఏడాది కురిసిన వర్షాలకు చెరువు కట్ట తెగిపోగా ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పనులను కాంట్రాక్టర్ కు అప్పగించింది. చెరువు కట్ట మరమ్మతు పనులను ఈఈ మంగళవారం పరిశీలించారు. ముందస్తుగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఈ విజయ్ కుమార్, ఏఈ నిఖిల్ పాల్గొన్నారు.