calender_icon.png 27 June, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘కంచ’ భూముల తాకట్టు నిబంధనలకు విరుద్ధం

27-06-2025 12:00:00 AM

‘సెబీ’కి మాజీ మంత్రి హరీశ్‌రావు లేఖ

హైదరాబాద్, జూన్ 26(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని తాకట్టు పెట్టి.. రాష్ట్రప్రభుత్వం టీజీఐఐసీ ద్వారా రూ.10 వేల కోట్ల మేర రుణం తీసుకున్నదని, అది నిబంధనలకు విరుద్ధమని మాజీ మంత్రి హారీశ్‌రావు ఆరోపించారు. గురువారం ఈ మేరకు ఆయన సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండి యా (సెబీ)కి లేఖ రాశారు.

సుప్రీం కోర్టు నియమించిన ప్రత్యేక కమిటీ సెంట్రల్ ఎంపవర్ కమిటీ ఇప్పటికే కంచ గచ్చిబౌలి భూములపై అధ్యయనం చేసి, సదరు భూముల అటవీశాఖ పరిధిలోని భూములని గుర్తించిందని గుర్తుచేశారు. వాస్తవాలను దాచి పెట్టి, టీజీఐఐసీ ద్వారా భూములు తాకట్టు పెట్టి రుణా లు సమీకరించడం సెబీ నిబంధనలకు విరుద్ధమని పేర్కొ న్నారు. టీజీఐఐసీ వార్షిక ఆదా యం రూ.150 కోట్ల కన్నా తక్కువే ఉంటుందని, ఆ మాత్రం ఆదాయానికే వేల కోట్ల అప్పులు తీసుకోవడం దేనికి సందేశమని ప్రశ్నించారు.

ప్రభుత్వం ఆర్థిక అవకతవకలకు పాల్పడిందని, రుణం సాధించేందుకు మధ్యవర్తులకు రూ.169.83 కోట్లమేర తాయిలం ఇచ్చిందని ఆరోపించా రు. రాష్ట్ర అటవీ సంపదను తాకట్టు పెట్టి, తప్పుడు పత్రాలు సృష్టించి, వ్యవస్థలను మోసం చేసి, అడ్డదారుల్లో రుణాలు సేకరించిన వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరపాలని, ఆర్థిక అవకతవకలను బయటపెట్టాలని సెబీకి విజ్ఞప్తి చేశారు.