26-06-2025 12:24:24 AM
రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యురాలు జ్యోత్స్న శివా రెడ్డి
మేడ్చల్, జూన్ 25(విజయ క్రాంతి): ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యురాలు జ్యోత్స్న శివా రెడ్డి అన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టాపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలను బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతుల వారిగా విద్యార్థుల సంఖ్యను గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
పాఠశాలలో నెలకొని ఉన్న సమస్యలను స్థానిక నాయకులు ఉపాధ్యాయులు ఆమెకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో సంఖ్య తక్కువగా ఉందని మూసివేసిన పాఠశాలలను మళ్లీ తెరిపించి మారుమూల గ్రామాల్లో సైతం నాణ్యమైన విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం కిష్టాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించి సమస్యలను పాఠశాల ప్రిన్సిపాల్ లలితను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యా శాఖ అధికారి శంకరయ్య, ప్రధానోపాధ్యాయుడు రమేశ్ నాయుడు, గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లలిత, తెలంగాణ రాష్ట్ర బేవరేజెస్ త్రిసభ్య కమిటీ సభ్యులు రెడ్డంగారి నవీన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మండల అధ్యక్షులు గోమారం రమణారెడ్డి, మేడ్చల్ మున్సిపల్ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాకేష్, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, తొంట యాదయ్య, వేముల సత్యనారాయణ రెడ్డి, ప్రభు, రామదాసు, సుధాకర్, మహేశ్, రంజిత్ రెడ్డి, శంకర్, మండల విద్యా శాఖ సిబ్బంది మల్లేశం, శ్రీనివాస్, రమేశ్ తదితరులుపాల్గొన్నారు.