calender_icon.png 7 June, 2025 | 11:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీలిమిటేషన్ లో ఎస్సీ డివిజన్ లను విడదీసే ప్రయత్నాన్ని ఆపాలి

07-06-2025 04:41:58 PM

కరీంనగర్ (విజయక్రాంతి): డీలిమిటేషన్లో ఎస్సీ డివిజన్లను విడదీసే ప్రయత్నం ఆపాలని మాజీ కార్పొరేటర్, అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర చైర్మన్ కంసాల శ్రీనివాస్ కోరారు. ఈ మేరకు శనివారం మున్సిపల్ ఇంచార్జ్ కమిషనర్, అదనపు కలెక్టర్ ప్రపూల్ దేశాయి(Additional Collector Praful Desai)కి వినతిపత్రం అందజేశారు. ఎన్నో సంవత్సరాలుగా నగరంలో సమూహంగా ఉంటూ దళిత వాడలుగా ఎస్టాబ్లిష్ అయినటువంటి కార్ఖానా గడ్డ, దుర్గమ్మ గడ్డ, కిసాన్ నగర్, సుభాష్ నగర్, అంబేద్కర్ నగర్, ఇందిరా నగర్, బుట్టి రాజారాం కాలనీ ఇలా కొన్ని ప్రాంతాలు నిర్దిష్టంగా ఉన్నాయి. 

ఇప్పటివరకు మున్సిపల్ ఎన్నికలలో ఎప్పుడు కూడా ఈ డివిజన్లను విడదీయలేదని, ఈ డివిజన్లో స్వరూపం మార్చలేదన్నారు. కానీ ఇప్పుడు ఇచ్చిన ముసాయిదా నోటిఫికేషన్ లో కార్ఖానా గడ్డ, అరుంధతి నగర్, కిసాన్ నగర్, రేకుర్తి ఇలా పలు  దళిత వాడలను ముక్కలుగా చేశారని అన్నారు. దళితులను దళితుడే పరిపాలిస్తే సమస్యలు తొలగిపోతాయని అంబేద్కర్ భావించారని, అందుకే దళితులకు ఒక ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేశారని, ఆ స్ఫూర్తితోనే ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా దళితవాడలను విడదీయలేదు కానీ ఇప్పుడు ఈ విడదీసే ప్రయత్నాన్ని వెంటనే ఆపివేయాలని కోరారు.