05-06-2025 01:02:57 AM
భద్రాద్రికొత్తగూడెం, జూన్ 4 (విజయక్రాంతి): మట్టి తోలకాలను నిలుపుదల చేస్తూ నీటిపారుదల శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. బుధవారం విజయ క్రాంతిలో ప్రచురితమైన పేరు తోటది... తోలేది వెంచర్ కు అనే శీర్షికకు స్పందించిన నీటిపారుదల శాఖ అధికారులు మట్టి తోలకాల అనుమతులను రద్దు చేశారు. పాల్వంచ పట్టణ పరిధిలోని శేఖరం బంజర్ కు చెందిన సర్వే నంబర్ 421 /A/1 లో 11 గుంటలు, 421/A A/లో 12 .33 ఎకరాలు, 42 2/A/2లో 0.30 ఎకరాలు మొత్తం 13.34 ఎకరాలకు 2020 జూలైలో కన్వర్షన్ పొందారు.
అనంతరం డిటిపిసి అప్రోల్ కు దరఖాస్తు చేయగా డ్రాఫ్ట్ను మంజూరు చేశారు. అదే సర్వే నెంబర్లను అదే విస్తీర్ణంలో గల పట్టాదారు పాస్ పుస్తకం ద్వారా చెరువు మట్టిని మామిడి తోటకు తోలాలంటూ దరఖాస్తు చేసి అధికారులను బురిడీ కొట్టించారు. ఈ అంశాన్ని విజయ క్రాంతి వెలుగులోకి తేవడంతో అధికారులు మట్టితోలకాలని నిలిపివేశారు.