‘కథ చెబుతా వింటారా’ కథల పోటీ
హనుమకొండ అర్బన్, జూన్ 1 (విజయక్రాంతి): హనుమకొండకు చెందిన సాగంటీస్ ఆరట్స్ అకాడమీ చిన్నారులకు తెలుగు పట్ల మక్కువ పెంచాలని, అమ్మ భాష ఐన తెలుగు భాషని గౌరవించాలని, మరుగున పడుతున్న సంస్కృతిని వికసింపజేయాలనీ, తెలుగు భాష మీద పట్టు, పదాల కూర్పు, సమయస్ఫూర్తి, వ్యాఖ్య నిర్మాణం, భాష సరళత, విలువలు, పద ధారలత, చక్కని వ్యాఖ్యనం ఇవ్వన్నీ పెంపొందించే దిశగా ‘కథ చెబుతా వింటారా’అనే పేరుతొ కథలు చెప్పే పోటీని నిర్వహిస్తున్నామని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ మంజుల సాగంటి తెలిపారు.
జూన్ లో ఈ పోటీ నిర్వహిస్తామని చిన్నారులు వారి పేరు వివరాలు 8143643337 నెంబర్ లో నమోదు చేసుకోవాలని ఆమె తెలిపారు. చిన్నారుల చేత ఇంట్లోనే 2 నిముషాలు నిడివి గల నీతి, విలువలు కలిగిన ఒక కథను చెప్పించి వీడియో తీసి వాట్సాప్ కు పంపితే, ఎంపిక చేయబడిన చిన్నారులకు న్యాయ నిర్ణేతల ముందు పోటీ నిర్వహిస్తామని తెలిపారు.
1,3 తరగతులు, 4,6 తరగతులు, 7,10 తరగతులు 1,2,3 విభాగలుగా పోటీ ఉంటుందని,3 నిమిషాల వ్యవధిలో కథ చెప్పవలసి ఉంటుందని, నీతి, విలువలు, మంచిని పెంచేలా కథలు ఉండాలన్నారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రం అందజేస్తామని, విజేతలకు బహుమతులు అందించబడతాయని చెప్పారు. చెప్పే కథ వ్రాత ప్రతితో ఫోటో జత చేసి అందించాల్సి ఉంటుందని, ఎంపిక చేయబడిన చిన్నారుల కథలన్ని పుస్తకరూపంలో అచ్చు వేయబడతాయని ఆమె తెలిపారు.






