calender_icon.png 1 August, 2025 | 6:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాల కార్మికులతో పనులు చేస్తే కఠిన చర్యలు

31-07-2025 10:16:33 PM

దౌల్తాబాద్,(విజయక్రాంతి): బాల కార్మిక వ్యవస్థ నిర్మూలిద్దామని, బాల కార్మికులతో పనులు చేయిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని రాయపోల్ ఎస్ఐ మానస అన్నారు. గురువారం రాయపోల్ మండలంలో ఆపరేషన్ ముస్కాన్ -11 లో భాగంగా కార్మిక శాఖ అధికారులతో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... బాల కార్మికుల చేత ఎటువంటి పనులు చేయించరాదని, వారిని పాఠశాలలో విద్యను అభ్యసించడానికి ప్రోత్సహించాలన్నారు. బడి ఈడు పిల్లలు అందరూ బడిలోనే ఉండాలని, బడి ఈడు పిల్లలను ఎలాంటి పనులు చేయించరాదన్నారు.

ఆపరేషన్ ముస్కాన్ తనిఖీలలో భాగంగా జిల్లా అసిస్టెంట్ లేబర్ అధికారి పాతూరు జ్యోతి ఆధ్వర్యంలో కార్మిక శాఖ అధికారులు, స్థానిక పోలీసులు కలిసి రాంసాగర్ గ్రామంలో గల  ప్రీమియం చిక్ ఫీడ్ సంస్థ యందు తనిఖీ నిర్వహించగా అందులో పని చేస్తున్న ఐదుగురు బాలకార్మికులను గుర్తించడం జరిగిందని వారిని పని నుంచి విముక్తి కల్పించి, సంస్థ యజమానులు సత్యేంద్ర కుమార్, సమాధాన్ తాత్యాబు లపై అసిస్టెంట్ లేబర్ అధికారి పాతూరి జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై  పేర్కొన్నారు.