29 June, 2026 | 1:08 AM

హోంగార్డ్ రక్తదానం

31-07-2025 10:19 PM

సిద్దిపేట క్రైమ్: రోగికి అత్యవసర సమయంలో రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నాడు ఓ హోంగార్డు. మిరుదొడ్డి మండలం కాసులాబాద్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి  సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అత్యవసరంగా అతడికి శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో బిపాజిటివ్ రక్తం అవసరము ఏర్పడింది. ఈ విషయం తోటి పోలీస్ మిత్రుల ద్వారా  తెలుసుకున్న  సిద్దిపేట వన్ టౌన్ హోంగార్డు రవి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి రక్తదానం చేశాడు. ఈ సందర్భంగా రోగి కుటుంబ సభ్యులు రవికి కృతజ్ఞతలు తెలిపారు.