27-05-2025 12:21:06 AM
గజ్వేల్, మే 26 : ప్రభుత్వ అనుమతి లేని నకిలీ కంపెనీల విత్తనాలు విక్రయించిన వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని గజ్వేల్ ఏడిఏ బాబు నాయక్ విత్తన వ్యాపారులను హెచ్చరించారు. సోమవారం గజ్వేల్ మండలం లోని, శ్రీ వెంకటేశ్వర రైతు సేవా కేంద్రం, శ్రీ సాయి పర్టీలైజర్, శివగంగా పర్టిలైజర్ తదితర ఎరువులు, విత్తనాల మరియు పురుగు మందుల,షాపులను ఆయన ఏవో నాగరాజు తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
దుకాణాలలోని స్టాక్ రిజిస్టర్ లను, విత్తనాలను పురుగుమందులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఐడియా బాబు నాయక్ మాట్లాడుతూ విత్తనాలు, ఎరువుల, పురుగుల మందులు అమ్మె డీలర్లు విధిగ విత్తనాల, ఎరువుల,పరుగు మందుల లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ ఆమోదిత కంపనిల విత్తనాలు, ఎరువుల, పురుగుల మందులను మాత్రమే విక్రయించాలని సూచించారు.
విత్తనాల, ఎరువుల ధరల పట్టిక షాపుల వద్ద రైతులకు కనబడేటట్లు ఉంచాలన్నారు. కొనుగోలు చేసిన వెంటనే రైతులకు ఇవ్వాలని, నఖిలి విత్తనాలు అమ్మితే పిడి చట్టం ద్వార కేసులు నమోదు చేసి శిక్షించబడతార న్నారు. కాలం చెల్లిన విత్తనాలు అమ్మినా, బ్లాక్ మార్కెటింగ్ కు తరలించినా, అధిక ధరలకు విత్తనాల, ఎరువుల అమ్మినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు .