05-06-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
ములుగు ప్రతినిధి, (విజయక్రాంతి): ప్రభుత్వం గుర్తించిన నాణ్యమైన విత్తనాలను మాత్రమే రైతులకు అమ్మాలని,విత్తనాలు అధిక ధరలకు,కల్తీ,నాణ్యత లేని విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సూచించారు.
బుదవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వ్యవసాయ శాఖ,పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ములుగు జిల్లాలోని సమస్త విత్తన ఎరువుల,పురుగు మందుల డీలర్ల శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విత్తన డీలర్లు అందరూ కూడా ప్రభుత్వ ఆదేశానుసారము వ్యవసాయ శాఖ సూచనలు మేరకు విత్తన కొనుగోలు చేసిన ప్రతి రైతుకి బిల్ ఇవ్వవలసిందిగా అట్టి బిల్లు మీద లాట్ నెంబర్,ఎక్స్పైరీ డేట్ రైతు యొక్క పూర్తి వివరాలు రాయాలని దాని మీద తప్పకుండా విత్తన షాపు యజమాని,రైతు సంతకము తీసుకోవాలని ఆదేశించడం జరిగింది.
బిల్లును పంట కాలువ అయ్యే వరకు కూడా భద్రపరుచుకోవాలని ప్రభుత్వ అనుమతి పొందిన విత్తనాలను మాత్రమే అమ్మకాలు చేయాలని ఆదేశించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ సిహెచ్ మహేందర్ జి,రవీందర్ డిఎస్పీ,సహయ వ్యవసాయ సంచాలకులు అవినాష్ వర్మ, ఏటూరు నాగారం,టాస్క్ఫోర్స్ సిఐ రమేష్,సమస్త మండల వ్యవసాయ అధికారులు, ఫర్టిలైజర్ సీడ్, పెస్టిసైడ్ దుకాణ యజమానులు పాల్గొన్నారు.