30 May, 2026 | 2:47 AM

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

30-05-2026 12:21 AM

మహబూబాబాద్, మే 29 (విజయక్రాంతి): అనుమతి పొందిన విత్తనాలను మాత్రమే విక్రయించాలని, నకిలీ విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, విత్తనాల విక్రయాల్లో ప్రభుత్వ ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని విత్తన విక్రయ షాపుల యజమానులకు అధికారులు సూచించారు.

టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో మరిపెడలో విత్తన వ్యాపారులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మరిపెడ ఎస్త్స్ర సతీష్ మాట్లాడుతూ లైసెన్స్ పొందిన షాపులు మాత్రమే విత్తనాలను విక్రయించాలని, నకిలీ విత్తనాలు విక్రయించినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకోబడతాయని, అదేవిధంగా విత్తనాలు ఖరీదు చేసిన ప్రతి రైతుకు బిల్లు తప్పకుండా ఇవ్వాలని సూచించారు. జూన్ 1 నుండి ప్రతివారం షాపులను విధిగా తనిఖీ చేయడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఏవో వీరా సింగ్, అసోసియేషన్ అధ్యక్షులు కాలం శ్రీనివాస్ రెడ్డి, ఉప్పల కృష్ణమూర్తి, చల్లారిష్, సురేందర్, రమేష్ రెడ్డి, గుండ్రాల ప్రసాద్, మాణిక్యం, అంబరీష తదితరులు పాల్గొన్నారు.