14-06-2025 08:59:22 PM
వెల్దండ సీఐ విష్ణువర్ధన్ రెడ్డి..
వెల్దండ: పోతేపల్లి గ్రామంలో జరిగిన వ్యక్తిగత గొడవకు సంబంధించిన వీడియోను, ఇందిరమ్మ ఇండ్ల కోసం కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణగా తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు వెల్దండ సీఐ విష్ణువర్ధన్ రెడ్డి(Veldanda CI Vishnuvardhan Reddy) పేర్కొన్నారు. బాధ్యత గల వ్యక్తులు వాస్తవాలు తెలుసుకోకుండా వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన వీడియోలను తమ స్వార్థ ప్రయోజనం కోసం వాడుతూ తప్పుడు ప్రచారం చేయడం సహించలేనిదన్నారు. వాటికి తప్పుడు వ్యాఖ్యలు జత చేయడంపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసిన వెంటనే అసలు ఘటనపై కేసు నమోదు చేయగా, అనంతరం సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుండటంతో అదనంగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తప్పుడు ప్రచారం చేసే వారి పట్ల ఎంతటి వారినైనా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.