14-06-2025 09:01:13 PM
వలిగొండ (విజయక్రాంతి): మండలంలోని వితంతువులు ఎన్ఎఫ్ బిఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసిల్దార్ దశరథ(Tahsildar Dasharatha) కోరారు. ఏప్రిల్ 12, 2017 తర్వాత భర్తలు చనిపోయిన వితంతువులు భర్త మరణ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ తో మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకొని వాటికి సంబంధిత పత్రాలను తహసీల్దార్ కార్యాలయంలో సమర్పిస్తే వారి అకౌంట్ లో నేరుగా 20 వేలు నగదు జమ చేపడుతుందని తహసిల్దార్ తెలిపారు.