calender_icon.png 6 June, 2025 | 1:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ భారతి గ్రామసభల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

31-05-2025 08:36:55 PM

ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు..

వనమహోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు..

జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్..

మహబూబాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి నూతన రెవెన్యూ చట్టంపై గ్రామ రెవెన్యూ సభలు, దరఖాస్తుల స్వీకరణ, నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, వనమహోత్సవం నిర్వహణకు సిద్ధంగా ఉండాలనీ, ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలకు ఏర్పాట్లు చేయాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(District Collector Adwait Kumar Singh) అధికారులను ఆదేశించారు.

శనివారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో డిఎఫ్ఓ విశాల్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.వీరబ్రహ్మచారి, రెవెన్యూ డివిజనల్ అధికారులు కృష్ణవేణి, గణేష్ లతో కలిసి జిల్లాలోని తహసిల్దారులతో రెవెన్యూ గ్రామసభల నిర్వహణ, రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు, వన మహోత్సవం లక్ష్యాలు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ భూభారతి నూతన రెవెన్యూ చట్టం ద్వారా రైతులకు, ప్రజలకు న్యాయమైన, వేగమైన, సేవలు అందించాలనే ఉద్దేశంతో జూన్ 3 నుండి 20 వరకు రెవిన్యూ  గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందని, భూ సమస్యలు పరిష్కారానికి రైతులు తమ దరఖాస్తులను ఇచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

ఇందుకోసం రెవెన్యూ యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, ప్రత్యేక హెల్ప్ డెస్క్, ఉద్యోగులను నియమించి దరఖాస్తు కేంద్రాలలో అన్ని ఏర్పాట్లను చేయాలన్నారు. దరఖాస్తు ఫారాలను ముందుగానే కేంద్రాలలో సిద్ధంగా ఉంచాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో నిర్వహించే వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని, ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్  హాజరు కానున్నట్లు తెలిపారు. ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాట్లు పక్కాగా అమలు చేయాలని, వేడుకలకు వచ్చే అతిథులు, ప్రజల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు.

ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక ప్రసంగం సిద్ధం చేయాలని సూచించారు. ప్రాంగణంలో శానిటేషన్, సౌండ్ సిస్టం, సాంస్కృతిక కార్యక్రమాలు షామియానాలు,  చైర్స్, త్రాగునీరు, స్నాక్స్, డెకరేషన్స్ తదితర అంశాలు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేసి వేడుకలు విజయవంతం చేయాలన్నారు. జిల్లాలో వన మహోత్సవం నిర్వహణకు అన్ని విభాగాలు సిద్ధంగా ఉండాలని, జిల్లాకు కేటాయించిన లక్ష్యం 1,50,13,500 కాగా అన్ని విభాగాల వారు ఈ లక్ష్యాలను వారికి కేటాయించిన ప్రకారం పక్కాగా పూర్తి చేయాలని, తద్వారా జిల్లాను హరితవనంగా మార్చుటకు అందరూ కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశాలలో జడ్పీ సీఈవో పురుషోత్తం, డీఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుసూదన రాజు, డిపిఓ హరిప్రసాద్, డిఏఓ విజయనిర్మల, డిఎస్ఓ ప్రేమ్ కుమార్, డిఎం సివిల్ సప్లై కృష్ణవేణి, డిఈఓ రవీందర్ రెడ్డి, డిఎంహెచ్ఓ డాక్టర్ రవి రాథోడ్,  కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, అన్ని విభాగాల జిల్లా అధికారులు, తహసిల్దారులు, తదితరులు పాల్గొన్నారు.