30 June, 2026 | 10:04 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

సమస్యల సాధనకు పోరాటమే శరణ్యం

18-04-2026 12:21 AM

భూత్పూర్, ఏప్రిల్ 17: తెలంగాణ ఉద్యోగ గెజిటెడ్ ఉపాధ్యాయ పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (టిజిఈజెయేసి)ఆధ్వర్యంలో శుక్రవారం ఆయా ఉద్యోగుల డిమాండ్ల పై మండల తహసీల్దార్ కిషన్ కు వినతి పత్రాన్ని అందజేశారు. టిజిఈజెఎసి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని స్థాయిల ఉద్యోగులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఉద్యోగుల పట్ల ప్రభుత్వ మొండి వైఖరికి నిరసన తెలిపారు.

అనంతరం తహసీల్దార్ కు ఉద్యోగుల డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా పీఆర్టీయూ టీఎస్ మండల అధ్యక్షులు సురేష్ రెడ్డి, ఉత్ఫ్ యుటీఎఫ్ జిల్లా నాయకులు వెంకటేష్ మాట్లాడుతూ ఉద్యోగుల పెండింగ్ బిల్లులను డీఏ లను విడుదల చేయాలని, తెలంగాణ రెండో పిఆర్ సి నివేదికను తెప్పించి 51% ఫిట్మెంటుతో వెంటనే అమలు చేయాలని, ఈ ఎచ్ ఎస్ విధివిధానాలను రూపొందించి అమలుచేయాలని రిటైర్డ్ అయిన ఉద్యోగులకు వెంటనే వారికి రావాల్సిన మొత్తాలను విడుదల చేయాలని, సిపిఎస్ రద్దుచేసి ఓపిఎస్ ను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.

ఈ ప్రధాన డిమాండ్ల తో పాటు 64 రకాల డిమాండ్ల సాధనకు తెలంగాణా ఉద్యోగ గెజిటెడ్ ఉపాధ్యాయ పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ దశలవారీగా ఉద్యమించనున్నదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ ఉపాధ్యాయ నాయకులు కృష్ణ,యాదయ్య, రేవతి, లింగం గౌడ్, సాయిరాం రెడ్డి, సాయిరాం ఖాదరయ్య, వెంకట్ నారాయణ, బాల్ రెడ్డి,ఆంజనేయులు,జెట్టి రామస్వామి, కనకమ్మ అధక సంఖ్యలో ఉద్యోగ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.