15 June, 2026 | 9:29 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •   ఘనంగా పాఠశాల పునఃప్రారంభం   •   రామలక్ష్మి పురం ప్రాథమిక పాఠశాల బడి పునఃప్రారంభం   •   ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే: జిల్లా కలెక్టర్ అంకిత్   •   ట్రాన్స్‌ఫార్మర్‌లో భారీ అగ్నిప్రమాదం   •   బల్మూర్ ఎంపీడీవోగా రేవంత్ రెడ్డి బాధ్యతల స్వీకరణ   •   అక్రమ మట్టి రవాణాపై కఠిన చర్యలు   •   కామారెడ్డి టిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కి సన్మానం   •   ఘనంగా ఉప ముఖ్యమంత్రి భట్టి జన్మదిన వేడుకలు   •  

పాఠశాలకు వెళ్తున్న ఆటో బోల్తా.. విద్యార్థి మృతి

10-12-2025 11:00 AM

హైదరాబాద్: కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం సావర్గావ్ గ్రామంలో(Savargaon Village) బుధవారం విషాదం చోటుచేసుకుంది. పాఠశాలకు వెళ్తున్న విద్యార్థుల ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆటో బోల్తా పడిన ప్రమాదంలో ఒక విద్యార్థి మృతి చెందగా మరో 14 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తక్షణమే సమీప ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన విద్యార్థి పదో తరగతి చుదువుతున్న ప్రణవ్ (15)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థి మృతి, మిగిలిన వారికి గాయాలు కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు.