22-09-2025 07:52:46 PM
మద్నూర్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లార గ్రామంలో విషాదం నెలకొంది. సోమవారం ఉదయం ప్రమాదవశాత్తూ చెరువులో పడి సాయి చరణ్(15) విద్యార్థి మృతి చెందినట్లు విద్యార్థి తండ్రి తెలిపారు. ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై విజయ్ కొండ సోమవారం సాయంత్రం విలేకరులకు తెలిపారు. విద్యార్థి మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. సెలవులపై ఇళ్లకు వచ్చిన విద్యార్థులు ఇంటిపట్టునే ఉండాలని, వాగులు వంకల వెంట తిరుగుతూ తల్లిదండ్రులను తీవ్ర బాధకు గురిచేయవద్దని మృతుడి తండ్రి పేర్కొన్నారు.