30 August, 2026 | 10:35 PM

Breaking News

ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత   •   సత్యనారాయణ గౌడ్‌ను పరామర్శించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు   •   జెండాపై కవిరాజు పుస్తకావిష్కరణ   •   గరిడేపల్లి బస్టాండ్ లో మహిళలకు కనీస వసతులను ఏర్పాటు చేయాలి   •   ఎన్నికలు ఎప్పుడు వచ్చిన టిఆర్ఎస్ గెలుపుకాయం   •   కొండ పోచమ్మ ఆలయంకు సీసీ కెమెరా వితరణ   •   గిరిజన విద్యార్థి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాదవ్ ప్రవీణ్ నాయక్   •   ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే విజయరమణ రావు   •   పాదయాత్రికుల దాహం తీర్చిన పిఎఆర్ టీమ్   •   కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వైఫల్యమే లక్ష్యంగా బీఆర్ఎస్ పోరుబాట   •  

ఏ ఆర్ ఎస్ కె నుండి అక్రమంగా యూరియా తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత

22-09-2025 07:49 PM

మహదేవపూర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కేంద్రంలో  ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం 2 నుండి అక్రమంగా తరలిస్తున్న యూరియా బస్తాల ట్రాక్టర్ ను అర్ధరాత్రి పట్టుకున్నట్లు ఎస్సై పవన్ కుమార్ తెలిపారు. వెంటనే స్పందించిన మండల అగ్రికల్చర్ అధికారిని సుప్రజ్యోతి సోమవారం రోజున ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం 2 తనిఖీ చేశారు. ఈ కేంద్రంలో రికార్డులు సరిగా రాయడం లేదని కొన్ని యూరియా బస్తాలను రసీదులు లేకుండా పంపించడం జరిగిందని, ఈ ఆగ్రో రైతు సేవా కేంద్రంపై ఎఫ్. సి. ఓ కు ఈ సేవా కేంద్రానికి యూరియా పంపించరాదని రికమెండ్ చేస్తూ లైసెన్స్ ను కూడా సస్పెండ్ చేయాలని కోరుతూ లెటర్ రాయడం జరిగిందని, ఈ ఆగ్రో రైతు సేవా కేంద్రం 2 కు షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగిందని అగ్రికల్చర్ అధికారిని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇద్దరు వ్యవసాయ క్షేత్రాధికారులు పాల్గొన్నారు.