11-06-2025 06:35:22 PM
మైల్వార్: వికారాబాద్ జిల్లాలో విషాదం చోటచేసుకుంది. పదోతరగతి విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన బషీరాబాద్ మండలం, మైల్వార్ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బషీరాబాద్ మండలం, మైల్వార్ గ్రామానికి చెందిన శాంతు విద్యార్థి పదోతరగతి చదువుతున్నాడు. మంగళవారం కొడంగల్ మండలం హుస్నాబాద్ లో పుట్టిన రోజుల వేడుకలు ఉన్నాయని నలుగురు స్నేహితులతో కలిసి వెళ్లాడు. ఇవాళ బషీరాబాద్-సెడం(కర్ణాటక) మధ్య రైలు పట్టాలపై మృతుడై నిపించాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. నిన్నటి వరకు తమ కళ్లముందే ఉన్న కుమారుడు ఇవాళ రైలు పట్టాలపై విగతజీవిగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. కుటుంబీకుల ఆర్తనాదాలతో గ్రామంలో విషాద చాలయాలుముకున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.