16-06-2025 06:26:41 PM
నిర్మల్ (విజయక్రాంతి): అంగన్వాడి పిల్లలను ఒకటో తరగతిలో నమోదు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ సమన్వయకర్త యన్ ప్రవీణ్ కుమార్(District Education Coordinator Praveen Kumar) నిర్మల్ లోని ఎంపీపీఎస్ శాంతినగర్ పాఠశాలను ఈ రోజు ఉదయం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాలలో విద్యార్థుల నమోదు వివరాలు, హాజరు వివరాలు పరిశీలించారు. పాఠశాలలో మొత్తం 95 మందికి గాను 66 మంది హాజరు అయ్యారన్నారు.
అంగన్వాడీలోని 5+ వయసు గల పిల్లలందరిని గుర్తించి, 1వ తరగతిలో నమోదు చేయాలన్నారు. ఇదివరకే నమోదు చేశామని ప్రధానోపాధ్యాయులు తెలపడం జరిగింది. అలాగే బడిబాటలో భాగంగా పాఠశాలలోని విద్యార్థుల ఎఫ్ఎల్ఎన్ సామర్ధ్యాలను పరీక్షించారు. విద్యార్థులందరికీ ఉచిత యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్ గౌడ్, ఉపాధ్యాయురాలు లావణ్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు.