calender_icon.png 4 September, 2025 | 3:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన: ఎస్ఐ మహేష్

03-09-2025 11:58:12 PM

సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలోని ఎస్టి ట్రైబల్ వెల్ఫైర్ బాలికల హాస్టల్ లో బుధవారం ఎస్సై మహేష్ విద్యార్థినిలకు సైబర్ క్రైమ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్సై మహేష్ మాట్లాడుతూ...ఈ ఆధునిక టెక్నాలజీ కాలంలో సెల్ ఫోన్ వినియోగం పెరిగిపోయిందని అన్నారు. ప్రతి నిమిషం సెల్ ఫోన్ లేనిది ఏ పని చేయలేకపోతున్నామని, ప్రతిదీ కూడా సెల్ ఫోన్ తోనే లింక్ ఉండడంతో మన సెల్ ఫోన్ నెంబర్ కూడా మన బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్, ఆధార్ కార్డు, పెన్షన్, పౌరసరఫరాల వినియోగానికి సంబంధించి అన్ని విధాలుగా మన సెల్ ఫోన్ నెంబర్ అవసరం ఉంటుందని అన్నారు.

దాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మనకు ఏదో లేనిపోని ఆశలు చూపించి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు ఆయన తెలిపారు. సైబర్ నేరాల పట్ల, ర్యాగింగ్, సైబర్ క్రైమ్, మత్తు పదార్థాలు డ్రగ్స్ (మాదకద్రవ్యలు) వంటి తదితర అంశాల పై యువత, విద్యార్థునులకు పూర్తిగా అవగాహన కలిగి ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఇటీవల కాలంలో మహిళలు పిల్లలను టార్గెట్ చేసుకొని సైబర్ నేరాలు పెరుగుతున్నాయన్నారు.

యువత ఇంటర్నెట్ పరిమితికి మించి వాడరాదని, సైబర్ నేరగాళ్లు రోజుకో రీతిలో ప్రజలను మోసం చేసి డబ్బులను కాజేస్తున్నారని అన్నారు. గుర్తు తెలియని వ్యక్తులు మీకు ఫోన్ చేసి మీ ఏటీఎం, పిన్ నెంబర్, సీవీవీ, బ్యాంకు ఖాతా తదితర వివరాలు కోరితే ఇవ్వరాదన్నారు. ఎవరైనా మీకు లాటరీ తగిలింది, కొంత డబ్బును సూచించిన బ్యాంకు ఖాతాలో జమచేయాలని ఫోన్ కాల్ వచ్చినా, ఏ విధంగా అయినా మీరు మీ బ్యాంకు ఖాతా నుండి డబ్బును కోల్పోతే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యాలని అన్నారు.

ఎలాంటి ఆపద సమయంలో సైబర్ నేరాల పట్ల టోల్ ఫ్రీ నెంబర్ 1930 (లేదా) 100 లకు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్తును తీర్చిదిద్దు కొనాలని, ఉన్నత ఉద్యోగాలు సాధించాలని మహిళలపై చిన్న పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టాలని ఉద్దేశంతోనే ఈ అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు.