17 April, 2026 | 2:52 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ఇందిరా మహిళా శక్తి చీరలు మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక

24-11-2025 05:27 PM

మహిళలకు చీరలు పంపిణీ చేసిన తహసీల్దార్ దయానందం..

తుంగతుర్తి (విజయక్రాంతి): సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ నేత కార్మికులు తయారుచేసిన ఇందిరా మహిళా శక్తి చీరలు రాష్ట్రంలోని మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నాయని తుంగతుర్తి తహసిల్దార్ దయానందం తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని మండల మహిళ సమాఖ్య కార్యాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మండల కేంద్రం చేసిన వివో 1, వివో 2, వివో 3 గ్రామ సంఘంలోని మహిళల సభ్యులకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తాహసీల్దార్ మాట్లాడుతూ... రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి పథకాన్ని మహిళల పేరుతో అమలు చేస్తుండడం శుభ సూచకమన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పన, మరమ్మతుల పనులు అమ్మ ఆదర్శ పాఠశాల కింద మహిళా సంఘాలకు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రెండోరోజు నుంచే మహి ళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరిట ఇస్తున్నామని వివరించారు. ప్రతి ప్రభుత్వ పథకం అమలులో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. వారి ఆర్థిక ప్రగతితో రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే ఉద్దేశ్యంతో పథకాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూపకల్పన చేస్తున్నారన్నారు. అర్హులైన ప్రతి మహిళకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం అశోక్ కుమార్, సీసీలు, వివో ఏలు, వివోబీలు, మహిళా సంఘాల అధ్యక్షులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.