16-06-2025 12:00:00 AM
సిద్దిపేట, జూన్ 15 (విజయక్రాంతి): క్రీడలలో విద్యార్థులు రాణించాలని తైక్వాండో సిద్దిపేట జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు రాధాకృష్ణశర్మ సూచించారు. ఆదివారం సిద్దిపేట ఐఎంఏ హాల్ లో సిద్దిపేట జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన తైక్వాండో కలర్ బెల్ట్ ప్రమోషన్ టెస్ట్ లో 60 మంది విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు తైక్వాండో కలర్ బెల్టులు, ధ్రువీకరణ పత్రాలు అందజేసినట్లు సిద్దిపేట జిల్లా తైక్వాండో కార్యదర్శి రాచకొండ శ్రీనివాస్ తెలిపారు.
సిద్దిపేట్ జిల్లా తైక్వాండో అధ్యక్షులు వేలేటీ రాధాకృష్ణ శర్మ, డి. వై. ఎస్. ఓ వెంకట నరసయ్య, రూరల్ సీఐ శ్రీనివాస్, డాక్టర్ ప్రణీతలు విద్యార్థులకు బెల్టులు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ శర్మ మాట్లాడుతూ మాట్లాడుతూ తైక్వాండో నేర్చుకోవడం వల్ల మానసిక ఒత్తిడి నుండి విముక్తి లభిస్తుందని, శారీరక దృఢ ఆలోచన శక్తి పెరుగుతుందని, ఆత్మ రక్షణకు ఆత్మ ధైర్యానికి తోడ్పడుతుందని ప్రతి ఒక్కరూ తైక్వాండో నేర్చుకోవాలని అన్నారు.
డి.వై.ఎస్.ఓ వెంకట నరసయ్య మాట్లాడుతూ తైక్వాండో నేర్చుకోవడం ద్వారా క్రమశిక్షణ, ఆరోగ్యవంతమైన జీవితం లభిస్తుందని తైక్వాండో, వివిధ క్రీడలు నేర్చుకోవడం ద్వారా విద్యా ఉద్యోగాలలో 2% స్పోరట్స్ కోట రిజర్వేషన్ లభిస్తుందన్నారు. సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ సిద్దిపేట తైక్వాండో విద్యార్థులు రాష్ట్ర, జాతీయస్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబరిచి సిద్దిపేట జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని, తల్లిదండ్రులు కూడా క్రీడలు ఆడేలా విద్యార్థులను ప్రోత్సహించాలని సూచించారు.