20-02-2026 12:00:00 AM
జగదేవపూర్, ఫిబ్రవరి 19: విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయిలకు ఎదగాలని విద్యాశాఖ డైరెక్టర్ వెంకట నరసింహారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళా శాలలో వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగదేవ్పూర్ కు చెందిన విద్యాశాఖ డైరెక్టర్ వెంకట నరసింహారెడ్డి హాజరయ్యారు.
అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తా ను కళాశాలలో 1983 -85 సంవత్సరంలో విద్యను అభ్యసించినట్లు తెలిపారు. విద్యార్థులు ఏ మార్గంలో విద్యను అభ్యసించాలి అలాగే మొబైల్ అవసరం కొద్దీ వాడాలని, అలాగే దుర్వినియోగం చేస్తే చెడు మార్గంలోని వెళ్తారని మంచి కోసమే మొబైల్ ను వాడాలని తెలిపారు.
అనంతరం రూ.10 లక్షలు బ్యాంకు ఖాతాలో లక్ష్మీబాయి మెమోరియల్ ట్రస్ట్ బ్యాంక్ ఖాతాలో చేస్తున్నామని, మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు తన తల్లి జ్ఞాపకార్థం ఫిక్స్ డిపాజిట్ ద్వారా వచ్చే వడ్డీ రూ.60 వేలతో సంవత్సరంలో విద్యార్థులకు బహుమతిగా అంది స్తామన్నారు.
మొదటి ర్యాంక్ రూ.30వేలు , 2 వ బహుమతికి రూ.20వేలు, 3వ ర్యాంక్ రూ.10 వేలు అందిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పనుగట్ల శ్రీనివాస్ గౌడ్,ఉప సర్పంచ్ గణేష్,వార్డు సభ్యులు,ఉపాధ్యాయులు, విద్యార్తులు పాల్గొన్నారు.