31-05-2025 07:10:34 PM
ఉప ముఖ్యమంత్రిని కలిసిన ట్రైనింగ్ విద్యార్థులు..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని టెక్ససోర్ ట్రైనింగ్ సెంటర్ విద్యార్థులతో శనివారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Deputy CM Mallu Bhatti Vikramarka) ముచ్చటించారు. కిన్నెరసానిలో ఆదివాసి శిక్షణా కార్యక్రమానికి హాజరైన ఉప ముఖ్యమంత్రిని వారు కలిశారు. శిక్షణ పొందుతున్న గిరిజన యువతితో ఆయన మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ప్రధానంగా సేఫ్టీ, ఫైర్, క్వాలిటీ ఎస్సూరెన్స్ రంగాల్లో శిక్షణ ఇచ్చి వివిధ ప్రభుత్వ ప్రైవేటు కర్మాగారాల్లో వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దేశంలో ఇలాంటి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇవ్వడం ఇదే ప్రధమన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ స్కీమ్ (ఎస్ సి ఎ) ద్వారా గిరిజన యువతి యువకులకు శిక్షణ ఇచ్చేందుకు జిల్లా కలెక్టర్ నిధులు విడుదల చేశారు. ఫిబ్రవరిలో దాదాపు 70 మంది యువతకు ట్రైనింగ్స్ ఇచ్చి కంపెనీస్ లో ఉపాధి చూపించడం జరిగిందనీ, ప్రస్తుతం 50 మంది శిక్షణ పొందుతున్నారనీ నిర్వాహకులు ఉపముఖ్యమంత్రికి వివరించారు.