calender_icon.png 31 May, 2025 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందుబాటులో సబ్సిడిపై జీలుగ విత్తనాలు

29-05-2025 01:49:04 PM

- ఏఓ అనిల్ కుమార్

పెన్ పహాడ్ : రైతుల సంక్షేమం కోసం..రైతుల భూములకు భూసారం పెంచేదిశగా ప్రభుత్వం జీలుగు విత్తనాలను(jeeluga seeds) సబ్సిడీ పై అందజేస్తున్నట్లు ఈ అవకాశం రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారిఅనిల్ కుమార్ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం(Penpahad mandal) అనంతారం (నారాయణ గూడెం- పీఏసీఎస్) కార్యాలయం లో జీలుగు విత్తనాలు పంపిణి చేసి మాట్లాడారు. ప్రభుత్వం 30 క్వింటాల జీలుగు విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు.. 30 కే.జీల విత్తనాల సంచి ధర రూ. 4275/- కాగా ప్రభుత్వ 50% రాయితీ పోను రైతు మిగిలిన 50%  రూ.2137/-చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ ఆలకుంట్ల సైదులు, ఏఈఓ శ్రావణి, రైతులు, సిబ్బంది ఉన్నారు