సబ్సిడీపై పెసర, మినుము విత్తనాలు రైతులకు అందజేత
30-12-2025 01:15 AM
టేకులపల్లి, డిసెంబర్ 29, (విజయక్రాంతి): టేకులపల్లి మండలంలో రైతులకు రబీ పంటకు విత్తుకునేందుకు పెసర, మినుములు 50 శాతం సబ్సిడీపై విత్తనాలు ఆత్మ కమిటీ చైర్మన్ బోడ మంగిలాల్ నాయక్ చేతుల మీదుగా సోమవారం టేకులపల్లిలో జరిగిన కార్యక్రమంలో రైతులకు అందజేశారు. ఈ సందర్బంగా మంగీలాల్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం రబీ సీజన్ లో విత్తుకునేందుకు ఏభై శాతం సబ్సిడీతో అందజేస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ లాల్ చంద్, వ్యవసాయ అధికారి అన్నపూర్ణ, వ్యవసాయ విస్తరణాధికారులు, రైతులు పాల్గొన్నారు.






