శాసనమండలి చైర్మన్ గుత్తా సురేందర్రెడ్డిని కలిసిన సూదిని రాంరెడ్డి
11-05-2026 12:30 AM
మాడ్గుల, మే 10 (విజయక్రాంతి): తెలంగాణ గ్రామపంచాయతీ ట్రిబ్యునల్ ఛైర్మన్గా నియమితులైన మాడ్గుల మాజీ ఎంపీపీ, టీపీసీసీ కార్యదర్శి సూదిని రాంరెడ్డి ఆదివారం రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సురేందర్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తమకు ఈ పదవి దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, చైర్మన్ గుత్తా సురేందర్ రెడ్డిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు తాండ్ర సాయిరెడ్డి పాల్గొన్నారు.






