చిన్నారులను సమర్థవంతులుగా తయారు చేయండి..
- ప్రతి బిడ్డ మొదటి అక్షరం అంగన్వాడీలోని నేర్చుకుంటుండ్రు
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
మహమ్మదాబాద్ మే 10 : చిన్నారులను అంగన్వాడి కేంద్రాల్లో సమర్థవంతంగా తయారు చేయాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం నంచర్ల గేటు దగ్గర మహమ్మదాబాద్, గండీడ్ మండల పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను ఎమ్మెల్యే అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్నారుల సంక్షేమం, గర్భిణీ స్త్రీల ఆరోగ్య సేవలు మరియు పోషకాహార కార్యక్రమాల అమలులో ఈ స్మార్ట్ ఫోన్లు కీలకంగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
అంగన్వాడి కేంద్రాలను లబ్ధిదారులు ఉపయోగించుకోవాలని పోషకహారం లోపానికి గురి కాకూడదని సూచించారు. ఎక్కడ ఎవరికి ఇలాంటి ఇబ్బందులు ఉన్న అంగన్వాడి కేంద్రాలను సందర్శించి అవసరమైన సూచనలు సలహాలను తీసుకోవాలని కోరారు. చిన్నారులు మొదటి అక్షరం అంగన్వాడి కేంద్రాల్లో నేర్చుకుంటున్నారని, పోషకాహారం క్రమం తప్పకుండా అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, స్థానిక నాయకులు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.






