08-06-2025 12:00:00 AM
తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ ఎన్నికయ్యారు. శనివారం హైదరాబాద్లో జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన పాలక మండలిని ప్రకటించారు. వైస్ ప్రెసిడెంట్స్గా రవీంద్ర గోపాల, ఉదయ్కుమార్రెడ్డి కే, సెక్రటరీగా శ్రీధర్ వీఎల్, జాయింట్ సెక్రటరీగా చంద్రశేఖర్రావు జే, ట్రెజరర్గా సత్యన్నారాయణ గౌడ్ బీ ఎన్నికయ్యారు.
మరో 15 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో నూతన అధ్యక్షుడు సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. “తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్న నావంతుగా పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తాను’ అన్నారు. కార్యదర్శి శ్రీధర్ మాట్లాడుతూ.. ‘ఇది 80వ జనరల్ బాడీ మీటింగ్. ది ఓల్డెస్ట్ ఛాంబర్.
80 ఏళ్ల క్రితం ఈ ఛాంబర్ పెట్టారు. నన్ను సెక్రటరీగా ఎన్నుకున్నందుకు పరిశ్రమ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను’ అని తెలిపారు. నూతన కార్యవర్గాన్ని పలువురు సినీ ప్రముఖులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో జెమినీ కిరణ్, సురేశ్బాబు, కేఎల్ దామోదర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.