14-06-2025 12:40:30 AM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మూఢనమ్మకాలతో ప్రవర్తించి జీవితాలను బుగ్గిపాలు చేసుకోకూడదని, నాగరిక ప్రపంచంలో అనాగరికమైన చర్యల వల్ల నష్టమే తప్ప లాభం లేదని మహబూబాబాద్ రూరల్ సిఐ సర్వయ్య అన్నారు. మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామంలో పోలీసు కళాజాత ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి మూఢనమ్మకాలు, నిరక్షరాస్యత, శాంతిభద్రతలు, మహిళల భద్రత, సైబర్ నేరాలపై కళారూపాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్సై దీపిక, ఏఎస్ఐ సూరయ్య, కానిస్టేబుళ్లు వెంకన్న, సురేష్, కళాబృందం సభ్యులు పృద్వి, సతీష్, తిరుపతి పాల్గొన్నారు.