14-02-2026 01:19:59 AM
భక్తుల వద్ద అదనపు డబ్బులు వసూల్ చేస్తే చర్యలు తప్పవు.
రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): వేములవాడ అంగరంగ వైభవం జరిగే శివరాత్రి పర్వదినాన వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా కల్యాణ కట్ట పర్యవేక్షణలో భాగంగా జిల్లా ఇండస్ట్రీయల్ మేనేజర్ హన్మంత్ నాయక్ కు శివరాత్రి ముగించే వరకు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ గా ఏర్పాటు చేసారు.
ఈ సందర్బంగా హన్మంత్ నాయక్ మాట్లాడుతు. శివరాత్రి రోజు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు అందేవిధంగా చూస్తామని అన్నారు.తల నీలాలు ఇచ్చేవారి దగ్గర ఎలాంటి అదనపు రుసుము వసులు చెయ్యరాదని హేచ్చరించారు. ఎలాంటి సమస్యలున్న నేరుగా వచ్చి తెలపాలని కోరారు.