31 July, 2026 | 11:39 AM

శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎంఆర్

31-07-2026 10:58 AM

దేవరకద్ర (విజయక్రాంతి): తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని శుక్రవారం తెల్లవారుజామున దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి దర్శనం చేసుకున్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని వర్షాలు సమృద్ధిగా కురువాలని ప్రార్ధించినట్లు తెలిపారు.